1. అర్జెంటీనా హమాస్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది
అర్జెంటీనా తాజాగా హమాస్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించి, దాని ఆర్థిక మూలాలను జప్తు చేయాలని అధికారులను ఆదేశించింది. గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో పాలస్తీనా గ్రూపు జరిపిన దాడిని అర్జెంటీనా ఖండించింది. అర్జెంటీనా దేశంలోని యూదులు ఉంటున్న ప్రాంతాలపై హమాస్ ఉగ్రదాడులు చేసిందని, ఈ సంస్థకు ఇరాన్తో సన్నిహిత సంబంధాలున్నాయని అర్జెంటీనా ఆరోపించింది.
జాతీయం
2. ఖతార్లో యూపీఐ సేవలు ప్రారంభం
దేశంలో డిజిటల్ చెల్లింపులకు కీలకంగా ఉన్న యూపీఐ సేవలను ఖతార్కు విస్తరిస్తున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్ (NIPL) తెలిపింది. ఖతార్ నేషనల్ బ్యాంక్ (QNB)తో ఒప్పందం జరిగినట్లు పేర్కొంది. ఖతార్లో నివసిస్తున్న భారతీయులు, ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడుతాయని NIPL చెప్పింది.
3. భారత జనాభా వృద్ధి – ఐక్యరాజ్యసమితి నివేదిక
భారతదేశంలో జనాభా విస్ఫోటం కొనసాగనుందని ఐక్యరాజ్యసమితి (UN) కుండబద్దలు కొట్టింది. ‘ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024’ నివేదిక ప్రకారం, ప్రస్తుత 145 కోట్లుగా ఉన్న భారతదేశ జనాభా 2060 దశకంలో 170 కోట్లకు చేరుకుంటుందని పేర్కొంది. 2100 నాటికి 150 కోట్లకు పడిపోనుందని కూడా తెలిపింది.
4. తగ్గిన చిన్నారుల మరణాలు
ప్రపంచ వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు 2023లో 5 లక్షల లోపుకు దిగొచ్చాయి. ఇంత తక్కువగా నమోదవడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. 2024లో ప్రపంచవ్యాప్తంగా సగటు ఆయుర్దాయం 73.3 సంవత్సరాలు. 2054 నాటికి ఆయుర్దాయం 77.4 సంవత్సరాలకు పెరగనుంది.
5. ఆంధ్రప్రదేశ్ APCNF ప్రోగ్రామ్ గుల్బెన్కియన్ ప్రైజ్ 2024 అందుకుంది
ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (APCNF) ప్రోగ్రామ్ గుల్బెన్కియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ 2024 అవార్డు పొందింది. జూలై 11న లిస్బన్, పోర్చుగల్లో జరిగిన వేడుకలో జ్యూరీ చైర్ మరియు జర్మనీ మాజీ చాన్సలర్ డాక్టర్ ఆంగెలా మెర్కెల్ ఈ ప్రకటన చేశారు.
ఆర్థికం
6. అగ్రీ ఫండ్ ఫర్ స్టార్టప్స్ & రూరల్ ఎంటర్ప్రైజెస్ (AgriSURE)
భారత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో స్టార్టప్లు మరియు గ్రామీణ వ్యాపారాలను ప్రోత్సహించడానికి అగ్రీ ఫండ్ ఫర్ స్టార్టప్స్ & రూరల్ ఎంటర్ప్రైజెస్ (AgriSURE) అనే కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ పథకం కోసం రూ. 750 కోట్ల నిధి కేటాయించారు.
7. ఐర్లాండ్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు
భారత విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లలో ఐర్లాండ్ నాల్గవ స్థానంలో నిలిచింది, మారిషస్ను అధిగమించి. ఐర్లాండ్ ప్రస్తుతం మొత్తం రూ. 4.41 ట్రిలియన్ ఆస్తులను కలిగి ఉంది.
వ్యక్తులు
8. జస్టిస్ ఆలియా నీలమ్ చీఫ్ జస్టిస్గా ప్రమాణస్వీకారం
జస్టిస్ ఆలియా నీలమ్ జూలై 11న లాహోర్ హై కోర్ట్ (LHC) చీఫ్ జస్టిస్గా ప్రమాణస్వీకారం చేసి, ఆ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమోట్ అయిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు.
Tags : July 13, 2024 – Top 10 Current Affairs in Telugu, Current Affairs, July 13 2024, International News, Argentina Hamas, UPI Services in Qatar, Indian Population Growth, United Nations Report, Child Mortality Rates, Andhra Pradesh APCNF Program, Gulbenkian Prize 2024, Agri Fund for Startups, Rural Enterprises, AgriSURE Scheme, Foreign Portfolio Investors, Ireland, Justice Aalia Neelum, Lahore High Court Chief Justice, Trending News, Telugu News